Wednesday 28 January 2015

క్రిమినల్స్ కులమేది?


గత దశాబ్ద కాలంలో ఈ దేశంలో, రాష్ట్రంలో ఎన్నో స్కాములు బయట పడ్డాయి. నిందితుల్లో కొందరికి శిక్ష పడింది, కొందరు తప్పించుకున్నారు, మరి కొన్ని సుదీర్ఘ కాలంగా విచారణలో ఉన్నాయి. 

ఇటీవల "అగ్రి గోల్డ్" సంస్థ తన డిపాజిట్ దార్లకు  వేలాది కోట్ల రూపాయల మెచ్యురిటి డిపాజిట్ల తిరిగి చెల్లింపులో విఫలం కావటంతో ఆ సంస్థ నిర్వహిస్తున్న పోంజీ స్కీం వ్యహారం బయట పడింది. వంద కోట్లు అంతకు మించి పబ్లిక్ నుంచి వసూలు చేసే కంపెనీలు తమ అనుమతిని తప్పనిసరిగా సెబీ నిబంధనలు చెబుతున్నాయి. సెబి వద్దనున్న సమాచారం మేరకు ఈ సంస్థ ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలోని  పేద, మధ్యతరగతి వర్గాల నుంచి రకరకాల స్కీంల రూపంలో 7,000 కోట్ల రూపాయల వరకు సేకరించినట్లు తెలుస్తుంది. దీనిలో ఒక్క ప్రకాశం జిల్లా నుండే 1,500 కోట్లు మదుపు దారులనుండి సేకరించారు. 

ఇటీవలి కాలంలో సంస్థ వసూళ్ల కన్నా మెచ్యూర్ అయిన డిపాజిట్లకు చెల్లించాల్సిన మొత్తం పెరగటంతో లిక్విడిటీ సమస్య ఏర్పడింది. దీంతో డిపాజిటర్లకు చెక్కులు బౌన్స్ కావటం ప్రారంభమయింది. ఫలితంగా మదుపర్లు వీధిన పడ్డారు. ఇప్పటివరకు కంపెనీ జారీ చేసిన దాదాపు 290 కోట్ల రూపాయల చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఈ పరిణామంతో దిక్కుతోచని లక్షలాది మంది డిపాజిటర్లు ఆందోళనతో అగ్రిగోల్డ్ సంస్థ విజయవాడలోని కార్యాలయం పైన దాడికి దిగారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. 

కంపెనీపై కర్నాటక, ఆంధ్రప్రదేశ్ కి చెందిన కొందరు కస్టమర్లు ఇప్పటికే ఆర్బీఐకి, సెబీ కి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై విచారణ కొనసాగుతుండగానే విజయవాడకు చెందిన కన్సూమర్ గైడెన్స్ సొసైటీ సెబీకి ఈ కంపెనీ నడుపుతున్న అనధికార పోంజీ స్కీంలపై పిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. ఆర్టీఐ యాక్టు కింద సేకరించిన సమాచారాన్ని అగ్రిగోల్డ్ అవకతవకలకు నిదర్శనంగా సమర్పించింది. ఖమ్మం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో దాదాపు వందమంది మదుపర్ల తరఫున సెబీకి పిర్యాదు చేసింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం, సెబి ఈ వ్యవహారంపై దృష్టి సారించి విచారణ చేపట్టింది, సిబిఐ దాడులు జరిపి సంస్థకు, యాజమాన్యానికి సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అగ్రి గోల్డ్ లిక్విడిటీ సమస్యకు అంతర్గతంగా చాలా కారణాలున్నాయని తెలిసింది. అందులో ముఖ్యమైనది ఛైర్మన్ అవ్వా వెంకటరామారావు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏహెచ్ఎస్వీ ప్రసాద్  కంపెనీ సొమ్మును తమ వ్యక్తిగత ఆస్థిగా మార్చుకుని, కొంత మొత్తం తమ బంధువుల బినామి పేర్లపై పెట్టినట్లు  చెప్పుకుంటున్నారు, ఈ మొత్తం 2,000 కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చని తెలిసింది. 

ఈ కంపెనీ డిపాజిట్లు, వడ్డీ కలిపి మొత్తం చెల్లించవలసిన సొమ్ము సుమారుగా 10,000 కోట్లు ఉంటుందని తేలింది. అగ్రిగోల్డ్ గ్రూపు రాజధాని ప్రాంతానికి ఆనుకుని ఉన్న హాయ్ లాండ్‌తోపాటు, 12,000 ఎకరాల భూములు, అగ్రి బిజినెస్, మీడియా, నిర్మాణ రంగాల్లో ఉంది. కంపెనీ వారు చెబుతున్న ప్రకారం దీని ఆస్థుల విలువ 15,000 కోట్ల వరకు ఉండవచ్చు.

అగ్రి గోల్డ్ కంపెనీపై సిబిఐ దాడులు, సెబి విచారణ వెనుక ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, రామోజీ రావు, కమ్మ పారిశ్రామిక వేత్తల లాబీ ఉందని కొన్ని "గ్రేట్ ఆంధ్ర" లాంటి వెబ్ సైట్ లు, బ్లాగుల్లో, సాక్షి వంటి పేపర్లలో ఈ వ్యవహారం మొత్తం "బ్రాహ్మణ వర్గం" పైన "కమ్మ వర్గం" జరిపించిన దాడిగా ప్రచారం చేస్తున్నారు. అగ్రి గోల్డ్ పైన పిర్యాదు చేసిన వారిలో అన్ని కులాల భాదితులు, ముఖ్యంగా వెనుకబడిన, దళిత వర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. 

"గ్రేట్ ఆంధ్ర" వెంకట రెడ్డి గతంలో తన వెబ్ సైట్ లో పిచ్చి రాతలు రాసినందుకు అరెస్ట్ చేసినా వాడికి ఇంకా సిగ్గు రాలేదు. ప్రతి చిన్న విషయానికి ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టే రాతలు రాసే ఇలాంటి వెధవలని సభ్య సమాజం నుండి బహిష్కరించాలి. వీడు ఎప్పుడైనా జగన్ అవినీతి పై కాని, గాలి జనార్ధన రెడ్డి అక్రమాలపై కాని, బ్రదర్ అనిల్ ఆక్రమణల పై కాని వీడి వెబ్ సైట్ లో వార్తలు రాశాడా? అన్ని కులాల్లోను వెధవలు ఉన్నారు.. మనం వారిని వ్యక్తిగతంగా విమర్శించవచ్చు అంతే కాని... ఆ కులాన్ని కాని, ఆ కులంలో అందరిని కాని విమర్శిస్తే అది సంస్కార హీనంగా ఉంటుంది. 

గతంలో వై.యస్.ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు "సత్యం" రామలింగరాజు అరెస్టు వెనుక, రామోజీ రావు "మార్గదర్శి" పై కేసు, పరిటాల రవి హత్య వెనుక, వై.యస్.ఆర్ హస్తం, క్షత్రియ, కమ్మ కులాల వారి పై రెడ్డి వర్గం వారి కుట్ర ఉందని అనుకోవాలా? ఆ తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో "నిమ్మగడ్డ ప్రసాద్", "కోనేరు ప్రసాద్" అరెస్ట్ వెనుక ఎవరి హస్తం ఉందో, ఏ కులం వారి ప్రమేయం ఉందో ఈ వెధవలు వాళ్ళ వెబ్ సైట్ లో కాని, పేపర్లో కాని రాయలేదే? జగన్ ను అరెస్ట్ చేసినప్పుడు మాత్రం కమ్మ వర్గం, చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, రామోజీ రావు, రిలయన్స్ అంబానీ కలిపి పన్నిన కుట్ర అంటూ తమ మీడియాలో ప్రచారం చేశారు. వీళ్ళకి సిగ్గు, శరం ఉందా! వీళ్ళు అన్నమే తింటున్నారా? 

ఈ లోకంలో రెండే కులాలున్నాయి, "డబ్బున్న వాడు.. డబ్బు లేనివాడు"... సత్యం రామలింగరాజు వ్యహారంలో, రెండేళ్ళ క్రితం విజయవాడలో జరిగిన "ఉమా చిట్ ఫండ్స్" వ్యవహారంలో ఎక్కువగా నష్టపోయింది వారి కులాల వారే! ఆర్ధిక నేరస్తులు 420 జగన్, గాలి జనార్ధన రెడ్డి, విజయసాయి రెడ్డి, కోలా కృష్ణ మోహన్, కొసరాజు వెంకటేశ్వర రావు, కోనేరు ప్రసాద్, సత్యం రామలింగరాజు.. వీరిది ఏ కులం!... వీరందరిది నేర కులమే!! క్రిమినల్స్ కు కులం ఆపాదించవద్దు. అనవసరంగా నేరస్థులకు కొమ్ము కాస్తూ,  ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ, కులం రంగు పులమొద్దు. 

మీడియా అనేది ప్రజలకు న్యాయం చేసే విధంగా వార్తలు రాస్తూ, అక్రమార్కులను చీల్చి చెండాడాలి కాని, నేరస్తులకు మద్దతిస్తూ, వారికి కొమ్ము కాసే విధంగా ఉంటె.. వారిపై ఎప్పుడో ఒకప్పుడు నష్టపోయిన ప్రజలే తిరగబడి బుద్ధి చెబుతారు. 

No comments:

Post a Comment